కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. నేరుగా ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్మీడియా, యూట్యూబ్ చానల్స్తోపాటు కొన్ని వార్తా చానళ్లలోనూ తన ఆస్తులు, పెట్టుబడులు, స్వచ్ఛంద సేవలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది భక్తులున్నారని, ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్న తనపై సోషల్మీడియా ద్వారా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ చానల్స్తోపాటు మరి కొందరు వ్యక్తుల గురించి ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఏపీలో తనకు బాబు, జగన్ల నుంచి ప్రాణహాని ఉందని వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయమై త్వరలోనే తెలంగాణ సీఎంను కలిసి వివరిస్తానన్నారు. ఏపీలోని ఒంగోలు ఠాణాలో తనపై ఉన్న కేసులను మళ్లీ ఓపెన్ చేసి ఇబ్బంది పెట్టడానికి బాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు.