నకిలీ ముద్రపై నిఖిల్ పంజా

  • In Film
  • January 25, 2019
  • 140 Views
నకిలీ ముద్రపై నిఖిల్ పంజా

పైరసీ లాంటి భూతాలు ఇప్పటిదాకా సినిమాలకే పరిమితం అనుకుంటున్నాం కాని ఇప్పుడు ఈ జాడ్యం ఇప్పుడు కొత్త రూపంలో పాకుతోంది. అసలు రిలీజే కన్ఫర్మ్ కాని సినిమాను ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో పెట్టి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు హీరో నిఖిల్ దృష్టికి తీసుకోవడంతో ఇది కాస్తా బయట పడింది. తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ కనితన్ రీమేక్ గా అదే దర్శకుడితో నిఖిల్ హీరోగా ముద్ర నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాణంతర కార్యక్రమాలు కాస్త ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. అయితే ఓ ప్రముఖ సినిమా టికెట్ బుకింగ్ యాప్ లో ముద్ర సినిమా టికెట్లు ఆన్ లైన్ లో పెట్టడంతో హటాత్తుగా ఏమైనా డిసైడ్ చేసారేమో అనుకుని కొందరు ఫ్యాన్స్ తో పాటు సినిమా అబిమానులు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. కొన్ని స్క్రీన్స్ లో ఏకంగా ఫుల్ అయ్యే దాకా వచ్చింది పరిస్థితి. అయితే సినిమా అప్ డేట్స్ మీద అవగాహన ఉన్న నిఖిల్ ఫ్యాన్స్ ఇందులో మోసాన్ని పసిగట్టారు. తమ హీరోకు తెలియకుండా నిర్మాణ సంస్థ ప్రమేయం లేకుండా ఏదో దురుద్దేశంతో ఇదంతా చేసారని గుర్తించి నిఖిల్ కు ట్విట్టర్ ద్వారా ఆధారాలతో సహా పంపించారు. దీంతో రంగంలో దిగిన నిఖిల్ నిర్మాతల టీం సదరు యాప్ తో పాటు థియేటర్ల మీద చర్యలకు ఉపక్రమించింది దీని గురించి నిఖిల్ క్లారిటీ ఇస్తూ తన ముద్ర ఈ దగ్గరలో విడుదల కావడం లేదని తమ సినిమా గురించి దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన వాళ్ళను వెంటనే గుర్తించి తన దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ పెట్టాడు. దీంతో ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. మొత్తానికి సినిమాను చెడు చేయడానికి ఎంతటికైనా తెగించే శక్తులు ఉన్నాయని మరోసారి ప్రూవ్ అయ్యిందిగా ..

తాజా సమాచారం