నేపియర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్ల్లో 5 వేల పరుగులు చేసిన టీమిండియా రెండో క్రికెటర్గా నిలిచాడు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా (101 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో విండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరిద్దరూ 114 ఇన్నింగ్స్ల్లో 5 వేల పరుగులు పూర్తి చేశారు. ఇక, తాజాగా ధవన్ 118 ఇన్నింగ్స్ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసి లారా రికార్డును సమం చేశాడు. మరోవైపు కోహ్లీ కూడా అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్మన్ జాబితాలో టాప్ టెన్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ 45 పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ పరుగుల సంఖ్య 10430కి చేరింది. దీంతో బ్రియాన్ లారా (10405) పరుగులను దాటేసి టాప్ టెన్లోకి ప్రవేశించాడు.