దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

  • In Crime
  • January 17, 2019
  • 763 Views
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

దిల్లీ: రాజధాని దిల్లీ నగరం పరిసరాల్లో సాయుధులైన దుండగులు ఈరోజు ఉదయం రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. జమ్ము-దిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలు తెల్లవారుజామున దిల్లీ శివారులోని బద్లి వద్ద ఆగింది. ఆ సమయంలో దుండగులు రైల్లోకి ప్రవేశించి రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, ఫోన్లు, బంగారు నగలు లాక్కొని పారిపోయారు.

ఏడు నుంచి పది మంది దుండగులు రైల్లోకి ప్రవేశించారని.. బీ3, బీ7 ఏసీ కోచ్‌ల్లో దోపిడీ చేశారని ఓ ప్రయాణికుడు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. మెడ దగ్గర కత్తి పెట్టి బెదిరించి విలువైన వస్తువులు తీసుకొని పారిపోయారని వెల్లడించాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos