తొలిప్రేమను వాడుకోని బ్యూటీ

  • In Film
  • January 29, 2019
  • 130 Views
తొలిప్రేమను వాడుకోని బ్యూటీ

గత ఏడాది వచ్చిన హిట్స్ లో ఒకటిగా నిలిచిన తొలిప్రేమ వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ రాశి ఖన్నాకు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి  తెలిసిందే. దాని ఫలితమే దర్శకుడు వెంకీ అట్లూరికి అక్కినేని కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసి మిస్టర్ మజ్ను ఇచ్చింది. అయితే అందులో అందరికన్నా ఎక్కువగా ఆకట్టుకున్న అంశం రాశి ఖాన్నే. బాగా సన్నబడిపోయి గ్లామర్ ను పెంచుకుని వరుణ్ తేజ్ కు తగ్గ జోడీని అనిపించుకున్న తీరు అందరికి తెగ నచ్చేసింది. అయితే తర్వాత కెరీర్ ని ప్లాన్ చేసుకున్న తీరుని గమనిస్తే రాశి ఖన్నా ఆ విజయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. దాని తర్వాత రాశి ఖన్నా తెలుగులో శ్రీనివాస్ కళ్యాణం మాత్రమే చేసింది. దాని ఫలితం తేడా కొట్టింది. అది పక్కన పెడితే వరసగా తమిళ్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న రాశి చెప్పుకోదగ్గ పాత్రలేవి దక్కించుకోలేకపోవడంతో అక్కడా కెరీర్ స్ట్రాంగ్ గా బిల్డ్ గా చేసుకోలేక ఇబ్బంది పడుతోంది.పోయిన సంవత్సరం ఇమైక్క నోడిగల్ అనే థ్రిల్లర్ ఒకటి చేసింది. అథర్వాకు జోడిగా నటించింది. అది నయనతార-అనురాగ్ కశ్యప్ ల సోలో షో. తనకు దక్కింది ఏమి లేదు. ఆ తర్వాత జయం రవితో అడంగ మరు అనే క్రైమ్ థ్రిల్లర్ చేసింది. అదీ ఈ మధ్య విడుదలైంది. రివెంజ్ ఫార్ములాలో సాగే ఈ మూవీలో కథ మొత్తం హీరో చుట్టూనే ఉంటుంది. దాంతో రాశి ఖన్నాది మొక్కుబడి పాత్రే అయ్యింది. వీటికన్నా ముందు మలయాళంలో విశాల్ మోహన్ లాల్ తో విలన్ అనే సినిమాలో నటిస్తే అది కనీసం తెలుగులో డబ్బింగ్ కూడా కాలేదు.ఇప్పుడు చేతిలో ఉన్న రెండు సినిమాల్లో ఒకటి టెంపర్ రీమేక్. అదీ విశాల్ వన్ మ్యాన్ షోనే. సో తొలిప్రేమ సక్సెస్ ని సరైన రీతిలో వాడుకోకపోవడంతో పాటు ఫోకస్ తమిళ్ మీద ఎక్కువ ఉంచడంతో రాశి ఖన్నాకు ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos