దిల్లీ: కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు మద్దతుగా ,కేంద్రానికి వ్యతిరేకంగా నల్లని దుస్తుల్లో తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రాహుల్తో పాటు సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆజాద్ ఇతరులూ పాల్గొన్నారు.