ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో జాతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోల్కతా సభతో మోదీ పతనం ఆరంభమైందన్నారు. అమరావతి సభతో మోదీ పతనం ఖరారు అవుతుందని వెంకన్న అన్నారు. బీజేపీ నాయకత్వంపై వ్యతిరేకతతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని అన్నారు. కన్నా నాయకత్వంలో ఏపీ బీజేపీ గుండు సున్నా కాబోతోందని, ఏపీకి మోదీ వస్తే ఖాళీ కుండలు పగులగొట్టి నిరసన తెలుపుతామని బుద్దా వెంకన్న అన్నారు.