అమరావతి:తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా కట్టిన నిర్మించుకున్న నివాసంలోకి బుధవారం ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వైఎస్ జగన్, భారతి దంపతులు అడుగుపెట్టారు. ఆ ఇంటి పక్కనే నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కూడా వైఎస్ జగన్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్లతోపాటు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు.