కూలిన నాలుగంతస్తుల భవనం: శిథిలాల కింద 5గురు

కూలిన నాలుగంతస్తుల భవనం: శిథిలాల కింద 5గురు

గురుగ్రామ్: గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఓ బుల్ డోజర్ శిథిలాలను తొలగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీని కనిపెట్టడానికి హర్యానా ఫైర్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగారు. భవనం కూలడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది అంటున్నారు. ప్రసిద్ధమైన సైబర్ హబ్ కు ఈ భవనం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తాజా సమాచారం