కథ విని మతిపోయింది…

  • In Film
  • February 9, 2019
  • 115 Views
కథ విని మతిపోయింది…

టాలీవుడ్ స్టార్ గా ఉన్న ప్రబాస్ ‘బాహుబలి’ తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.  ప్రభాస్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్లో ‘సాహో’ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు.  ఈ సినిమా రిలీజ్ కాకమునుపే ప్రభాస్ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళిన విషయం  తెలిసిందే. ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించని ఈ సినిమాను అభిమానులు #ప్రభాస్ 20 గా రిఫర్ చేస్తున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా బ్యూటిఫుల్ హెగ్డే నటిస్తోంది.  ఈ సినిమా ఒక పీరియడ్ లవ్ స్టొరీ. ఈ చిత్రం గురించి పూజ మాట్లాడుతూ  ” #ప్రభాస్ 20 ఒక అమేజింగ్ స్క్రిప్ట్. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఇదే.  ఈ సినిమా కథ విన్నప్పుడు నా మతిపోయింది. ఇందులో నేను పోషించేది ఒక ఛాలెంజింగ్ రోల్. అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం. ఇదో అందమైన సినిమా. యునీక్ గా ఉంటుందని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నా” అంటూ తెగ ఎగ్జైట్ అయ్యింది.ఈ సినిమాకోసం అందరూ చాలా కష్టపడుతున్నామని కూడా చెప్పింది.  పూజ చెప్పేది వింటుంటే నిజంగానే సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి. ఇటలీ నేపథ్యంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన లవ్ స్టొరీ అంటున్నారు కాబటి కథ ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపట్ల కుతూహలం నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos