కంటతడి పెట్టిన నితీష్ కుమార్

కంటతడి పెట్టిన నితీష్ కుమార్

పాట్నా: భారత రక్షణ శాఖ మాజీ మంత్రి ఫెర్నాండెజ్‌ స్మృతులను తలుచుకుంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారంనాడు కంటతడిపెట్టారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జి ఫెర్నాండెజ్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఫెర్నాండెజ్ గురించి నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఫెర్నాండెజ్ నాయకత్వం, ఆయన నిర్దేశకత్వంలో తాము ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు. ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం పాటుపడటం ఆయన నుంచే తాను నేర్చుకున్నానని, ఆయన మార్గదర్శకత్వాన్ని, ప్రజాపోరాటాలకు ఏనాడూ తాము దూరం కామని నితీష్ అన్నారు. ఫెర్నాండెజ్ మృతి కారణంగా రాష్ట్రంలో రెండు రోజుల సంతాప దినాలను బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.  ఫెర్నాండెజ్ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos