తాను సీఎం చంద్రబాబు వద్దకు ఓపెన్ మైండ్తో వెళ్తున్నానని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. గురువారం ఏబీఎన్తో మాట్లాడుతూ పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సీఎంకు చెబుతాన్నన్నారు. రెండు నెలల నుంచి ప్రతిరోజూ తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ కోణం నుంచే ఆలోచిస్తున్నానని… ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయేమో తనకు తెలియదన్నారు. తోట త్రిమూర్తులు, తన అనుచరులతో మాట్లాడానని, టీడీపీలో ఇమడలేకపోతున్నానని చెప్పారు. చీరాల నియోజకవర్గానికి పనులు చేసిన విషయం వాస్తవమే అన్నారు. తాను ఎవరికీ హాని చేయలేదని, ఇబ్బంది పెట్టలేదని ఆమంచి తెలిపారు. ఇండిపెండెంట్గా గెలిచినవాడ్ని అని.. అందరితో బాగుండాలని కోరుకుంటానని అన్నారు. సీఎం పిలిస్తే వెళ్తున్నానని.. ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు.