అమరావతి: ‘లోకేశ్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ చేసావు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా ? మీ నాన్నా?’ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండవీడు రైతు కోటయ్య మృతిపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని లోకేశ్ ఒక ట్వీట్లో ఖండించారు. దీనికి విజయసాయి రెడ్డి చాలా ఘాటుగా
ఈ మేరకు స్పందించారు. రైతు శవాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అధ్యక్షుడు జగన్ కుల రాజకీయం చేస్తున్నారని రెండు రోజుల కిందట లోకేశ్ ట్విటర్లో విమర్శలు చేసారు. శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బ తిన్నా బుద్ధి రాలేదు. రైతు వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైసీపీ అజెండానా?’ అని లోకేశ్ ప్రశ్నించారు.