కావలి నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తాను ఎంపీగా పోయే ఆలోచన లేదని సీఆర్డీఏ సభ్యుడు బీద మస్తాన్రావు స్పష్టం చేశారు. మంగళవారం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందినా నియోజకవర్గం అభివృద్ధికోసం కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. పోయిన చోటనే వెతుకునే మనస్తత్వం కలవాడినని గత ఎన్నికల్లో కావలిలో ఓటమి చెందినా తిరిగి కావలి అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యేగానే పోటీచేసి ఓడినచోటే విజయం సాధించి ముందుకు పోతానన్నారు. తనను అభిమానించే వేలాదిమంది ప్రజలను నిరాశ పెట్టదలుచుకోలేదని, తాను ఎంపీగా పోతానన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని తాను కావలినుంచే పోటీలో ఉంటానని స్పష్టంచేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజవర్గ ఇన్చార్జిలు బీసీ ఓట్ బ్యాంక్ను దృష్టిలో పెట్టుకుని ఎంపీ అభ్యర్థిగా బీఎమ్మార్ బాగుంటుందని ముఖ్యమంత్రిని కోరుతున్నారన్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టంచేశారు