బాహుబలికి
ముందు ఒక లెక్క బాహుబలి తరువాత ఒక లెక్క రీతిలో తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితులు
మారిపోయాయి.అప్పటి వరకు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలను అత్యంత భారీ
బడ్జెట్గా పేర్కొనేవారు.అయితే బాహుబలి విడుదలైన అనంతరం లెక్కలన్నీ తారుమారు
కావడంతో స్టార్హీరోల సినిమాల బడ్జెట్ వందల కోట్లు దాటుతున్నాయి.ఇప్పటికే కొన్ని
చిత్రాలు వంద రెండు వందల కోట్లను దాటేసాయి కూడా.చిరంజీవి కొత్త చిత్రం సైరా రూ.200
కోట్లకు పైగానే ఉండగా తారక్—చరణ్ల మల్టీస్టారర్ చిత్రం కూడా రూ.300 కోట్ల బడ్జెట్తో
తెరకెక్కుతోంది.ఇదే క్రమంలో విడుదలకు సిద్ధమవుతున్న కొత్త చిత్రం సాహో బడ్జెట్
కూడా రూ.250 కోట్లు దాటినట్లు తెలుస్తుండగా త్వరలో రాధాకృష్ణ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్న
కొత్త చిత్రం కూడా రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్నట్లు సమాచారం.ఇటలీ
నేపథ్యంలో తీసే పీరియాడిక్ ప్రేమకథా చిత్రం కావడంతో సెట్టింగ్లు,గ్రాఫిక్స్
కోసం ఇంతటి భారీ మొత్తంలో వెచ్చించనున్నట్లు సమాచారం..