ఇద్దరు పిల్లలతో గర్భిణి ఆత్మహత్య

బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరి పిల్లలకు నిప్పంటించి తాను కూడా మంటల్లో పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పల్లాపురంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన శివరాముడు, వెంకటలచ్చమ్మ బార్యభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం వీరిద్దరు ఘర్షణ పడ్డారు. అనంతరం వెంకటలచ్చమ్మ(35), తన ఇద్దరి పిల్లలైన పవన్‌కుమార్‌(13), పావని(9)తో కలసి ఈ దారుణానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భిణి అని బంధువులు తెలిపారు. సంఘటన స్థలంలోనే ముగ్గరూ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న భర్త శివరాముడు పరారీలో ఉన్నాడు. నందివర్థన్‌ ఎస్సై హరిప్రసాద్‌ ఘటనా స్థలికి చేరుకొని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos