అమిత్ షా కాదు… అబద్ధాల పుట్ట

అమిత్ షా కాదు… అబద్ధాల పుట్ట

అమరావతి:‘అతను అమిత్‌ షా కాదు, అబద్ధాల షా’ అని ముఖ్యమంత్రి  చంద్ర బాబు నాయుడు శుక్రవారం
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఈసడించారు.  ఉదయం తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై చర్చ జరగాలని  పిలుపు నిచ్చారు.  అమిత్‌ షా
రాష్ట్ర ప్రజల్ని  రెచ్చ గొట్టే
 ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రానికి  ఇచ్చిన
హామీల్లో 90 శాతాన్ని నెరవేర్చినట్లు  పచ్చి అబద్ధాలు డుతున్నారు.
తప్పు చేశామన్న పశ్చాత్తాపం వారిలో ఏ కోశానా కానరావటం లేదు. మనల్ని ఇంకా బాధ పెట్టాలనే పైశాచికత్వం వారిలో ఉంద’ని
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలపై ఎక్కడికక్కడ
భాజపా నేతల్ని నిలదీయాలని  సూచించారు. బకాయి రూ.లక్ష కోట్లు అంది
ఉంటే ప్రగతి పథంలో మరింత ముందుకు వెళ్లి ఉండేవారమన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మోదీ, అమిత్ షా బ్రహ్మాండమైన జోడీ అని ఎద్దేవా
చేసారు. జాతీయ స్థాయిలో మద్దతు తెలిపిన వారే  తమకు మిత్రులు అన్నారు.

అందుకే జగన్విదేశీ పర్యటన

హవాలా సొమ్ములు తెచ్చేందుకే జగన్‌ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని, జగన్‌ ఎందుకు వెళుతున్నారు? అని ప్రశ్నించారు.

తాజా సమాచారం