అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష కౌరవ సభను తలపించిందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్విట్ లో ఎగతాళి చేసారు. ‘‘చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించింది. లక్ష్మణ్ కూమార్ కూడా సభకు వచ్చి వెళ్లారు. ధుర్యోదన ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదు.’’అని ఎద్దేవా చేసారు.. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించే ఐవైఆర్ ఈ ట్విట్లు చేసినట్లు భావిస్తున్నారు.