భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీపై ఇప్పటికే అనేకసార్లు విమర్శలు గుప్పించిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా ధోనీ విరమణపై స్పందించాడు. ధోనీ భవితవ్యం ఎలా ఉండబోతోందంటూ ఎదురైన ప్రశ్నకు. ‘నాకు తెలియదు బాస్. మన గ్రేట్ సెలెక్టర్లు మీకు ఎప్పుడైనా తారసపడితే… ఆ విషయాన్ని వారినే అడగండి. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. నేను కాదు’ అని చెప్పాడు.మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. సెలెక్టర్ల పని అంత తేలికైనది కాదని అన్నాడు. 15 మంది ఆటగాళ్లను జట్టులోకి సెలెక్ట్ చేసినప్పుడు… అర్హత కలిగిన మరో 15 మంది ఆటగాళ్లపై చర్చ జరుగుతుందని చెప్పాడు. ఆధునిక క్రికెట్ కు తగ్గ స్థాయిలో మన సెలెక్టర్లు లేరనేది తన అభిప్రాయమని తెలిపాడు.