పోలీసులు వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ యువకుడి తల్లితండ్రులు, గ్రామస్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్స్టేషన్ ఎదుట నిరసనలకు దిగారు.అశ్వారావుపేటకు చెందిన కళ్యాణ్, నాని, అశోక్, సాయి అనే యువకులు ఏటీఎంకు వెళ్లారు. అక్కడ కూడా డబ్బులు రాకపోవడంతో వేరే ఏటీఎంకు వెళ్లారు. అక్కడ కూడా డబ్బులు రాకపోవడంతో కోపంతో కళ్యాణ్ అనే యువకుడు ఏటీఎంను కాలితో గట్టిగా తన్నడంతో ఏటీఎం పాక్షికంగా ధ్వంసమైంది..దీంతో ఘటనపై స్థానిక ఎస్ఐ, సీఐకి ఫోన్ చేసి సమాచారం అందించి ఇంటికి వెళ్లిపోయారు.మరుసటి రోజు ఉదయం పోలీసులు సాయి, కళ్యాణ్, అశోక్, నానిలను అదుపులోకి తీసుకొని రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచుకుని పోలీసులు వేధింపులకు గురి చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.రాత్రి తమకు సమాచారం ఇచ్చి యువకులను అప్పగించారని తెలిపారు. అయితే పోలీసులు వేధింపులు తాళలేకపోవడంతో కళ్యాణ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువలు ఆరోపించారు. మృతుడి ఇంటి దగ్గర నుంచి మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు..