ఢిల్లీ :యమునా నది నీటి ప్రవాహం ప్రమాద స్థాయి చేరుకుంది. . గత కొన్ని రోజులుగా ఢిల్లీకి ఎగువన ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదికి వరద పోటెత్తుతోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. గురువారం ఉదయం 8 గంటల సమయానికి నదిలో నీటి మట్టం 204.88 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.