భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్కు కౌంట్డౌన్ మొదలైన నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని పీఎస్ఎల్వీ సీ-47 నమూనాకు పూజలు నిర్వహించారు.మంగళవారం ఉదయం 05.28 గంటలకు మొదలైన పీఎస్ఎల్వీ సీ-47 కౌంట్డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది.రేపు ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ-47ను నింగిలోకి పంపుతారు. 714 కిలోల బరువు ఉన్న కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలను రోదసిలోకి పంపుతారు.