విజయ్‌ మల్య భవంతిని సొంతం చేసుకున్న హైదరాబాద్‌ కంపెనీ

  • In Money
  • August 14, 2021
  • 111 Views
విజయ్‌ మల్య భవంతిని సొంతం చేసుకున్న హైదరాబాద్‌ కంపెనీ

ముంబై : కింగ్ ఆఫ్ గుడ్‌ టైమ్స్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మల్య ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాదుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది.
ముంబై విమానాశ్రయానికి సమీపంలోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.
విజయ్ మల్య బిజినెస్ రంగానికి గ్లామర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మల్య ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద అతని ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos