ఇంటికి రండి మాట్లాడుకుందాం

ఇంటికి రండి మాట్లాడుకుందాం

ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం రాసిన బహిరంగ లేఖలో కోరారు. ఒక కుటుంబ పెద్దగా తిరుగుబాటు దార్ల శిబిరం పట్ల ఆవేదనతో ఉన్నట్టు తెలిపారు. ‘మీరంతా గత కొద్దిరోజులుగా గౌహతి హోటల్లో చిక్కుకు పోయారు. ప్రతి రోజూ మీ గురిం చి  ఓ కొత్త సమాచారం బయటకు వస్తోంది. చాలా మందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే. మీ కుటుంబ సభ్యులు కొందరు నన్ను సంప్రదించారు. వారి భావోద్వోగాలను కూడా నాతో పంచుకున్నారు. శివసేన కుటుంబ పెద్దగా మీ అందరి మనోభావాల పట్ల నాకు గౌరవం ఉంది” అని పేర్కొన్నారు. రెబల్ క్యాంప్ నాయకుడిగా చెప్పుకుంటున్న ఏక్నాథ్ షిండేను పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, ఎవరో చేసిన పొరపాటుకు వారి వలలో చిక్కుకోవద్దని రెబల్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. శివసేన ఇచ్చిన గౌరవం ఇంకెక్కడా దొరకదని,  మీరు ముందుకు వచ్చి, మాట్లాడితే, మార్గం సుగమ మ వుతుందని సూచించారు.”గందరగోళానికి స్వస్తి చెప్పండి. తప్పనిసరిగా దీనికొక పరిష్కార మార్గం ఉంది. మనం కలిసి మాట్లాడుకుందాం. ఒక అవగాహనకు వద్దాం. శివసేన పార్టీ చీఫ్గా, కుటుంబ పెద్దగా ఇప్పటికీ మీ గురించి ఆవేదన చెందుతున్నాను. ముందుకు రండి, పరిశీలించండి, హాయిగా ఉండండి” అని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos