హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరతకు, రైతులు ఇబ్బందులు పడటానికి కేంద్రామే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని నెలలుగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదని తెలిపారు. యూరియా విషయమై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే.. ప్రధాని మోదీ దాని అడ్డుకున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి ఆగిపోయిందని పేర్కొన్నారు. కావాలనే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తోందని ఆరోపించారు.