పోరుబాటలో అన్నదాతలు

పోరుబాటలో అన్నదాతలు

న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన గురువారం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. సింఘు, టిక్రీ, గాజీపుర్ దీక్షాస్థలి నుంచి ప్రదర్శన నిర్వహించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య వేలాది మంది అన్నదాతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనవరి 26న దిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించదలచిన కవాతుకు ముందస్తు కసరత్తుగా దీన్ని భావిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు దీక్షాస్థలి నుంచి కుండ్లి-మనేస్వర్-పల్వాల్ ర్యాలీ మొదలైంది. ఈ మార్గాల్లో దిల్లీ, హరియాణాకు చెం దిన పోలీసులు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. 3,500కు పైగా ట్రాక్టర్లు, ట్రాలీలతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు భారతీ కిసాన్ ఏక్తా యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ తెలిపారు. బీకేయూ నేత రాకేష్ తికైత్ నేతృత్వంలో మొదలైన ఈ యాత్ర పల్వాల్ వైపు కొనసాగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించక పోతే.. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ తెలిపారు. హరియాణా నుంచి దాదాపు 2,500 ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయని చెప్పారు. తీవ్రమైన చలి, వర్షం వణికిస్తున్న అన్నదాతలు పట్టువిడవకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos