తమిళనాటా సర్వం బంద్

తమిళనాటా సర్వం బంద్

హొసూరు : తమిళనాడులోని అన్ని విద్యా సంస్థలు, మద్యం దుకాణాలు, థియేటర్లు, మాల్స్‌, రిసార్టులను ఈ నెల 31 వరకు మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి ప్రకటించారు. కరోనా భీతి నేపథ్యంలో సోమవారం ఆయన తన మంత్రివర్గ సహచరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మ్యూజియంలు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్నాజియంలను సైతం మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కిండర్‌గార్టెన్‌, ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. వివాహాది శుభకార్యాలపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులను ఈ నెలాఖరు వరకు నిషేధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా పాజిటవ్‌ కేసు నమోదైంది. కాంచీపురానికి చెందిన 45 ఏళ్ల ఇంజనీరు కరోనా బారిన పడగా, అతనికి పూర్తి స్వస్థత చేకూరడంతో నేడో రేపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos