తిరుపతి : తిరుపతి లోక్సభ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది.