అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 9,256 నమూనాల్ని పరీక్షించి మరో 36 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే వ్యవధిలో 50 మంది కోలుకుని విడుదలయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,100కు చేరింది. ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతున్నారు.