ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై కి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో మానవబాంబులతో దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు. కోటి మంది లక్ష్యంగా ఈ దాడి జరుగుతుందని.. నగరం మొత్తం దద్ధరిల్లుతుందంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.