25 కోట్ల శ్రమ జీవుల సమ్మె రేపు

25 కోట్ల శ్రమ జీవుల సమ్మె రేపు

న్యూఢిల్లీ: కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న అఖిల భారత సమ్మెను భారీగా విజయవంతం చేయాలని పోరాట సంఘాలు పిలుపు నిచ్చాయి. ప్రభుత్వ “ప్రజా వ్యతిరేక” విధానా లకు నిరసనగా జరగనునన దేశ వ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల కంటే ఎక్కువ కార్మికులు, శ్రమ జీవులు పాల్గొంటారు. జనవరి 2, 2020న జరిగిన సమావేశంలో తమ డిమాండ్లకు భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైంది. దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టను న్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు (సిటియు) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల ఫలితంగా నిజ వేతనాలు పడి పోయాయి. అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కూడా వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయి. ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయానికి ప్రభు త్వంి నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం తరువాత 93,600 టెలికాం కార్మికులు ఇప్పటికే విఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) కింద ఉద్యోగాలను కోల్పోయారు. ప్రత్యామ్నాయ విధానాల కోసమే దేశ కార్మికవర్గం ఐక్యంగా పోరాడతాం. ఇంకా రైల్వేలలో ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తి యూనిట్ల కార్పొరేటైజేషన్, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నా’మని కార్మిక సంఘాలు వివరించాయి. జెఎన్యూలో చెలరేగిన హింసను ఖండించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావం తెలిపారు. 175 పైగా రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతోపాటు ‘గ్రామీణ భారత్ బంద్’ పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి. దేశవ్యాప్త సమ్మెకు గత సెప్టెంబర్లో కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos