ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ఉండటం దీనికి కారణం. సెన్సెక్స్ ఏకంగా 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు పెరిగి 16,931 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్ (5.19%), యాక్సిస్ బ్యాంక్ (4.00%), టాటా స్టీల్ (3.75%), టైటాన్ కంపెనీ (3.75%), మారుతి సుజుకి (3.03%) దండిగా లాభాల్ని గడించాయి. నెస్లే ఇండియా (-1.10%), టెక్ మహీంద్రా (-1.01%), టీసీఎస్ (-0.43%)బాగా నష్ట పోయాయి.