రాంచి:ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు జేఎంఎం నేత హేమంత్ సోరెన్. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించినట్లు జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య వెల్లడించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈ నెల 7న జరగనున్నట్లు తెలిపారు. గురువారం గవర్నర్తో ఇండియా కూటమి నేతల భేటీ అనంతరం ఈ మేరకు వివరించారు. అంతకుముందు, బుధవారమే ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ నేపథ్యంలో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.