వెలుగులోకి దిశ నిందితుల దారుణాలు..

వెలుగులోకి దిశ నిందితుల దారుణాలు..

దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.దిశ హత్యాచారం తరహాలోనే నిందితులు ఆరీఫ్‌,చెన్నకేశవులు తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో తొమ్మిది హత్యాచారాలకు తెగబడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా, చెన్నకేశవులు ముగ్గురిని అంతమొందించినట్టు చెప్పారు. ఘటనలన్నీ మహబూబ్నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం.వారు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్టు గుర్తించారు. దిశ నిందితుల డీఎన్ఏను మృతి చెందిన వారి డీఎన్ఏతో విశ్లేషిస్తున్నారు. నిందితులకు సంబంధించి కోర్టుకు సమర్పించనున్న చార్జిషీట్లో వారు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos