ముంబై: ఏక్ నాథ్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు ఆరంభమయ్యాయి. శివసేన రెబెల్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ కుటుంబానికి చెందిన స్పిన్నింగ్ మిల్లుకు రూ. 15.17 కోట్ల నిధు లను విడుదల చేసింది. రూ. 80 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ రాష్ట్ర పెట్టుబడిగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిప్పుడు వివాదా స్పదమయింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చి, ఏక్ నాథ్ సీఎంగా కావడానికి సహకరించినందుకే అబ్దుల్ సత్తార్ కు ప్రభుత్వం కానుక ఇచ్చిందని పలువురు విపక్ష నేతలు విమర్శించారు. శివసేన తిరుగుబాటు వర్గంలో ప్రభుత్వం నుంచి బహుమతిని అందుకున్న తొలి నేత అబ్దుల్ అని అంటున్నారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రోకోనే అని దుయ్యబడుతున్నారు. మరోవైపు దీనిపై అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ… ఇటీవలే ఈ స్పిన్నింగ్ మిల్ ను ప్రభుత్వ సహకారంతో స్థాపించామని చెప్పారు. ఈ మిల్లు వల్ల ఎందరికో జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. తన కుమారుడు మిల్లు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారని చెప్పారు.