ముంబయి: దేశీయ స్టాక్
మార్కెట్లుం గురువారం కూడా లాభాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9.28 గంటలకు
సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 37,891, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 11,379 వద్ద ట్రేడయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు
జోరుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ,
యస్బ్యాంక్, ఫెడరల్
బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల షేర్లు
దాదాపు ఒక
శాతం
లబ్ధి పొందాయి. టాటా
మోటార్స్ షేర్లు దాదాపు
రెండు
శాతం వరకు కుంగాయి. కొన్ని
రకాల కార్లు సూచించిన దాని కంటే ఎక్కువగా కార్బన్డై
ఆక్సైడ్ను
విడుదల
చేస్తుండటంతో జాగ్వార్, ల్యాండ్రోవర్లకు చెందిన
దాదాపు
44 వేల
కార్లను రీకాల్
చేయటం షేర్లను ప్రభావితం చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయ
విలువ బలహీనపడింది. 14 పైసలు నష్టంతో 69.68 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి
ఆ
తర్వాత
కోలుకొని రూ.69.63 వద్ద నిలిచింది.