కడపః వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరమైంది. ఏడుగురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ఏడుగురు అనుమానితులను శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిర్బంధించింది. ఎర్ర గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి వ్యక్తి గత సహాయకుడు కృష్ణారెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి, డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కూస్ట్ టీమ్ ఇచ్చిన ఆధారాల ప్రాతిపదికన సిట్ విచారణ కొనసాగుతోంది.