అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడికి బుధ వారం నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ అయ్యిం ది. కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చిన రంగాలు- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోలు బంకు లు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్లెట్లు, విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలు, పరిశ్ర మలు, వ్యవ సాయ, అనుబంధ రంగాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్లు. రాక పోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని, విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని సూచించింది. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనుమతినిచ్చింది. తప్పనిసరివివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు పెట్టింది. రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొంది.