సుప్రీంకోర్టు ఈ-మెయిల్ నుంచి మోదీ ఫోటో తొలగింపు

న్యూ ఢిల్లీ : సుప్రీం కోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ లో ప్రధాని మోదీ చిత్రాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) తొలగించింది. దాని స్థానే విద్యుత్ వెలుగుల్లో ఉన్న సుప్రీం కోర్టు భవనం ఫోటోను పెట్టింది. దేశ అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్సైట్ల, ఈ-మెయిల్స్లో ‘సబ్కా సాత్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో పాటు మోదీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింద భాగంలో కూడా దీన్ని ఉంచింది. ఈ విషయాన్ని కొందరు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రిజిస్ట్రీ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తొలగించాలని ఎన్ఐసీని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos