న్యూ ఢిల్లీ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితుడు టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. శనివారం సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. పిటిషన్ ను సోమవారం రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని న్యాయవాది లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోరారు. చంద్రబాబు రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో విచారణను అత్యవసరంగా విచారించాలని విన్నవించారు. పిటిషన్ ను మంగళవారం ప్రస్తావించడానికి ధర్మాసనం అనుమతించింది. విచారణ తేదీని మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది.