నీళ్లు తాగాడని యువకుడిని కొట్టి చంపిన హోటల్‌ వ్యక్తులు

నీళ్లు తాగాడని యువకుడిని కొట్టి చంపిన హోటల్‌ వ్యక్తులు

హైదరాబాదు: హోటలో అడగకుండా నీరు తాగాడని సాయిలు అనే యువకుడ్ని హోటల్ వ్యక్తుల కొట్టి చంపిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా టెక్మల్ మండలం బోడ గట్టుకు చెందిన చాకలిసాయిలు(30) మీనా దంపతులకు ఇద్దరు కుమారులు మాహి (6), కిరణ్ (4) ఉన్నారు. వీరు బీరంగూడలో ఉంటూ, మియాపూర్ లో ఇసుక అన్ లోడ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక ఖాళీ చేయడానికి వచ్చిన సాయిలు పక్కనే వున్న హోటల్ లో నీరు తాగేందుకు వెళ్ళాడు. తమను అడగకుండా నీళ్ళేందుకు తాగావని హోటల్ వ్యక్తులు సాయిలుతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పెద్దది కావడంతో హోటల్లో పనిచేసే వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఆగ్రహంతో సాయిలు గొంతుకు టవల్ కట్టి బిగించి హత్యకు పాల్పడారు. దీంతో ఊపిరి ఆడక అతడు చనిపోయాడు. ఈ ఘటన పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దార్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos