సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి రావద్దంటూ నిరసన..

సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి రావద్దంటూ నిరసన..

హైదరాబాద్: తన స్వార్ధం కోసం తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి సీఎల్పీని టీఆర్ఎస్‏లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే సబితారెడ్డి అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్‏లోకి రావడానికి ప్రయత్నించడం సహించరానిదని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి వస్తున్నారన్న సమాచారంతో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్ల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో సబితారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించడానికి ముఖ్య పాత్ర పోషించిన సబితారెడ్డి తన రాజకీయ స్వార్ధం, అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని దుయ్య బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos