కారుప్రమాదంలో టీమిండియా క్రికెటర్
సురేశ్ రైనా తీవ్రంగా గాయపడ్డాడని ఓ వైపు, అతను చనిపోయాడని మరో వైపు సామాజిక మాధ్యమాల్లో
దుష్ప్రచారం సాగింది. దీనిని రైనా ఖండించాడు. తాను నిక్షేపంగా ఉన్నానని ట్విటర్లో
స్పందించాడు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ ప్రచారం వల్ల తన కుటుంబ సభ్యులతో పాటు
స్నేహితులు ఆవేదనకు గురయ్యారని తెలిపాడు. దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించామని, వారిపై
చర్యలు తీసుకుంటాని పేర్కొన్నాడు.