న్యూఢిల్లీ : భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను లాక్కుంటోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసారు. ‘మోదీ ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను లాక్కుంటోంది. ఇది మానవత్వానికి వ్యతిరేక నేరం. ఈ దేశ ఉత్తమ భవిష్యత్తు కోసం మనం అన్ని వర్గాలను గౌరవించాల’ని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 10న మానవ హక్కుల దినో త్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబరు 10న సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది.