న్యూ ఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరపరాదని న్యాయమూర్తులు గవాయ్, సూర్యకాంత లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం శనివారం తెలంగాణ సీబీని ఆదేశించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని తాఖీదులు జారీ చేసింది. అప్పటివరకు తదుపరి విచారణ వాయిదా వేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేలా ప్రలోభాలకు గురిచేశాడని రేవంత్ రెడ్డిపై ఏసీబీ అభియోగాలు మోపింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్ద డబ్బు సంచులతో రేవంత్ రెడ్డి ఉన్న వీడియోలు తీవ్ర సంచలనం సృష్టించాయి. రేవంత్ రెడ్డి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరటనిచ్చే ఆదేశాన్ని జారీ చేసింది. రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది.