అల్లర్లను ఆపలేక పోయిన వారు గద్దె దిగాలి

అల్లర్లను ఆపలేక పోయిన వారు గద్దె దిగాలి

న్యూ ఢిల్లీ:ఈశాన్య ఢిల్లీలో గత వారం సంభవించిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవటంలో దారుణంగా విఫలమైనవారు వెంటనే తమ పద వులకు రాజీనామా చేయాలని నటుడు రజనీకాంత్ డిమాండు చేసారు. పలువురు ముస్లిం ప్రముఖులతో భేటీ అయిన తర్వాత ఈ మేరకు ట్వీట్ చేసారు.దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తన వంతు బాద్యతను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవించినట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos