చత్తీస్గఢ్: మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ తాజా ఫోటోను బుధవారం మావోయిస్టులు విడుదల చేశారు. రాకేశ్వర్ తమ దగ్గరే సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్ను విడుదల చేస్తామని తేల్చి చెప్పారు. మధ్యవర్తుల పేర్ల విషయంలొ కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే మావోయిస్టులతో చర్చలకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు బహిర్గతం కాలేదు.