చెన్నై: నటుడు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రజనీకాంత్ నటించి ఇటీవల విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడంలేదు. అందువల్ల ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్టీవీ నెట్వర్క్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ కేసు జస్టిస్ తమిళ్ సెల్వీ ముందు ఇటీవల విచారణకు వచ్చిన సమయంలో సెన్సార్ బోర్డు తరుఫున దాఖలు చేసిన నివేదికలో ఆ చిత్రంలో అధికంగా ఫైటింగ్ సన్నివేశాలు, మద్యం, ధూమపానం సేవించే సన్నివేశాలతో పాటు అసభ్యకరమైన సంభాషణలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, కూలీ చిత్రాన్ని వీక్షించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ చిత్రాన్ని చూసేందుకు చిన్నారులకు అర్హులు కారని నిర్థారించారు.