న్యూఢిల్లీ : వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలుగులో మంగళ వారం చేసిన ట్వీట్ లో విమర్శించారు. ‘తెలం గాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు.