ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్లో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్లో గెలుపు అంచున బోల్తా పడడంతో క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు సెలెబ్రిటీలు చివరకు సగటు భారతీయుడు కూడా ఎంతగానో బాధపడ్డాడు.ప్రపంచకప్ భారత్దే అనుకుంటున్న తరుణంలో సెమీఫైనల్లో చతికిలబడడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో భారత్కు మద్దతుగా ట్వీట్ చేసి బహుభాష హీరోయిన్ పూజాహెగ్డే విమర్శపాలయ్యారు.భారత్ ఓటమి గురించి ట్విట్టర్లో పూజా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే..”భారత్ ఓటమిని తట్టుకోలేకపోతున్నా. కానీ.. ధోనీ మాత్రం చాలా బాగా ఆడారు.. నువ్వు నా ఫేవరేట్ ఆటగాడివి ఎందుకయ్యావో మరోసారి నిరూపించావు. భారత్ ను గెలిపించడం కోసం అతను చేయాల్సిందంతా చేశాడు. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించాడు. మాజీ నాయకుడికి గౌరవం.. ప్రేమతో” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.ఇది చూసిన నెటిజన్లు పూజాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్యానికి దగ్గరగా వెళ్లిన మ్యాచ్ ధోనీ వలనే చేజారిపోయిందని విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ధోనీనే అని.. చాలా బంతులు వృధా చేశాడని.. మరీ ఇంత కూల్ అయితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.చివరి ఓవర్ వరకు సింగిల్స్ తీసి టీమ్ ఓడిపోవడానికి కారణమయ్యాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. గెలవాల్సిన మ్యాచ్ ను ఓడించిన ధోనీని ప్రశంసిస్తావా..? అంటూ కొందరు పూజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి భారత జట్టు 18 పరుగులతో ఓడిపోవడంతో పరోక్షంగా కారణమయ్యాడు ధోనీ. చివరిదాకా పోరాడిన ఆయన రన్ అవుట్ కాకపోయి ఉంటే భారత జట్టు గెలిచే అవకాశం ఉండేది. ఇవే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వరల్డ్ కప్లో ధోనీ సాధించిన ఘనత ఏంటో! ఎందుకంతగా పొడుగుతున్నావ్ పూజా అంటూ పూజాహెగ్డేకు చురకలంటిస్తున్నారు నెటిజన్లు.
Heartbreaking to see India lose today but #Dhoni you beauty, you proved today why you’re my favourite… he gives every match his all and he really tried hard to pull through for us…Much love and respect to our former skipper ❤️
— Pooja Hegde (@hegdepooja) July 10, 2019